Translate

26 December, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి) - 126



తెలుగు సుద్దులు…..(126)
.వె||మన్నును దినుమం`టె మండేరు జనులార
         మంట్టి లోని మేలు మరువనే`    
         నీళ్లలోని మేలు నిఖిలమై యుండురా!
            విశ్వదాభిరామ వినర వేమా!.         
భావముః
మట్టిని తినమంటే జనులు మండిపడతారు; మట్టిలోని మంచిని మరిచిపోతేఎలాగా? నీళ్లలోని మంచి సర్వమై (సంపూర్ణంగా వ్యాపించి) ఉంటుంది. పద్యంలో వేమన పంచభూతాలలో మానవుని ఉనికికి మూలాధారమైన మన్ను (తనకు అవసరమైన ఆహారాన్ని నిత్యం అందిస్తున్నది; తను జీవనము సాగించడానికి, నివసించడానికి దోహదపడుతున్నది), నీటి యొక్క విశిష్టతను కూడా తెలియచెప్పుతూ, వాటిని తృణీకరించడము స్రేయస్కరము కాదని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సృష్టికి మూలమైన పరమాత్మను గుర్తించి కొలవమంటే సామాన్యమానవులు ఈసడించుకోవటము, మండిపడటము తగదని హితవుపలుకుతున్నారు. ||25-12-2014||

No comments:

Post a Comment