Translate

21 November, 2014

తెలుగు సుద్దులు - వేమన పద్యములు (తెలుగు - ఇ కూటమిలో పెట్టబడినవి)-111

తెలుగు సుద్దులు…..(111)
ఆ.వె||గాలి గాలి గలసె గగనంబు గగనంబు,
        మన్ను మన్ను గలసె మంట మంట;
        నీరు నీట గలసె నిర్మలంబై`యుండె
        విశ్వదాభిరామ వినర వేమా!.
భావముః
గాలి గాలితో కూడినపుడు, ఆకాశము ఆకాశముతో కూడినపుడు, మట్టి మట్టితో కూడినపుడు, నీరు నీటితో కూడినపుడు స్వచ్ఛంగా, నిర్మలంగా ఉంటాయి. పంచ భూతాత్మకమైన - గాలి, ఆకాశము, మట్టి, అగ్ని, నీరు – శరీరము లోని ఆత్మ, పంచభూతలకు మూలాధారమైన పరమాత్మ ఒకటే అని గ్రహించినపుడు, ఐక్యతపొందినపుడు ముక్తి (స్వచ్ఛత, నిర్మలత్వము) పొందవచ్చని వేమన తెలుపుతున్నట్లున్నది. ||21-11-2014||

No comments:

Post a Comment